ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం




ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం

అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : నగరంలోని గాంధీ చౌక్ లో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల ముదిరాజ్ మహాసభ అధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముదిరాజ్ కార్పొరేషన్ ను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమమలో ముదిరాజ్ యూత్ అధ్యక్షులు యేండ్ర కిరణ్ కుమార్ ముదిరాజ్, యూత్ సభ్యులు పేంచాల మహేష్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more