జియోబుక్ పేరుతో మార్కెట్లోకి రానున్న ల్యాప్టాప్లు
రిలయెన్స్ సంస్థ ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రత్యర్థి సంస్థలన్నిటినీ వెనక్కినెట్టి ముందుకు దూసుకుపోతుంది. అది టెలికాం రంగమైనా, ఇంటర్నెట్ అయినా, మొబైల్ రంగమైనా.త్వరలోనే 5జీ మొబైల్స్ ముందుకు రానున్న రిలయెన్స్ మరో కొత్త ప్రోడక్ట్ తో మార్కెట్ ను కుదిపేయనుంది. త్వరలోనే జియో ల్యాప్టాప్లు మార్కెట్ లోకి రానున్నాయి. జియోబుక్’ పేరుతో తీసుకురానున్న ఈ ల్యాప్టాప్లు మరో రెండు నెలల్లో మార్కెట్ లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. బడ్జెట్ ల్యాప్టాప్ గా చెబుతున్న ఈ “జియోబుక్” కొత్త జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. జియోబుక్ 4జీ ఎల్టీఈకు కూడా సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్ తయారీల కోసం జియో చైనాకు చెందిన బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
జియో ల్యాప్టాప్లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ల్యాప్టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్కోమ్ ఆడియో చిప్లతో ల్యాప్టాప్లను రూపొందిస్తున్నారు.