బైబిల్ పార్టీ కావాల్నా? భగవత్గీత పార్టీ కావాల్నా ?




బైబిల్ పట్టుకొని వచ్చే  పార్టీ కావాలో భగవద్గీత పట్టుకొని వచ్చే పార్టీ కావాలో తేల్చుకోవాలని తిరుపతి ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఏపీలో దేవతల విగ్రహాలు విధ్వంసం అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తిరుపతి ఏడు కొండలను రెండు కొండలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని బండి సంజయ్ అన్నారు. హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారని దీనిని తాము ఎదుర్కొంటామన్న సంజయ్ తిరుపతి ఉప ఎన్నిక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని  వైసీపీ ప్రభుత్వం మూట ముల్లె సర్దుకొని పరారయ్యే రోజు ఎంతో దూరం లేదని  హెచ్చరించారు. తిరుపతిలో ప్రజలు కులాలుగా చీలిపోవద్దని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించాలన్నారు బండి సంజయ్. తిరుపతి బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే యుద్దం ప్రారంభించారని, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకన్నా ఆంధ్రా బీజేపీ కార్యకర్తలు బలవంతులని తిరుపతి ఎన్నికల్లో గెలిచివస్తారని సంజయ్ పేర్కొన్నారు. 


Latest News
more

Trending
more